ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
NEWS Nov 13,2024 05:24 pm
కేంద్ర ప్రభుత్వ జన సురక్షా భీమా పథకాలైన ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన నమోదు కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలం సిర్పూర్లో జిల్లా లీడ్ బ్యాంక్ వారు ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ పథకాలపై అవగాహన కల్పించి గ్రామంలోని అర్హులైన వారందరికీ నమోదు చేసారు. కార్యక్రమం మల్లాపూర్ యూబీఐ మేనేజర్ శంకర్,జిల్లా లీడ్ బ్యాంక్ ఎఫ్ఎల్సీ కోట మధుసూదన్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.