గొర్రెపల్లిలో ఘనంగా మహాదేవుని ఉత్సవాలు
NEWS Nov 13,2024 10:40 am
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో వెలిసిన అతి పురాతమైన మహాదేవుని ఆలయంలో దాతల సహకారంతో బుధవారం ద్వజ స్తంభం, కల్యాణ విగ్రహలను ప్రతిష్టాపన చేశారు. అనంతరం శాంతి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులంతా పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో దాతలు గెల్లె మల్లేష్ యాదవ్-రజిత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.