ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి కృషి
NEWS Nov 13,2024 05:19 am
విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు విచ్చేసి మంత్రికి తమ సమస్యలను వినతి రూపంలో విన్నవించారు. వినతులను స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు పాల్గొన్నారు.