రెడ్డిలంతా నా బంధువులు కాదు: రేవంత్
NEWS Nov 13,2024 04:09 am
ఢిల్లీ: అమృత్ స్కాంలో తనపై కేటీఆర్ చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. "రెడ్డిగా పేరున్న వారందరూ నా బంధువులు కాదు" అని సీఎం చెప్పారు. తన బావ సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి అమృత్ కింద రూ.1,137 కోట్ల టెండర్ ను రేవంత్ కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. అమృత్ టెండర్లపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ అతనికి ఉందని రేవంత్ అన్నారు.