సామాన్యులపై పెను భారం!
NEWS Nov 12,2024 05:24 pm
కూరగాయలు, పండ్లు, నూనెలు ఇతరత్రా నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టాన్ని తాకి 6.21%గా నమోదైంది. ఇది RBI నిర్దేశించుకున్న 4% లక్ష్యం కంటే అధికం. అయితే, Sepలో 5.49%గా నమోదవ్వడం గమనార్హం. అర్బన్ ప్రాంత ద్రవ్యోల్బణం 4.62% నుంచి 5.62 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 6.68%గా నమోదైంది. ధరల మోత సామాన్యులపై పెను భారం మోపుతోంది.