కథలాపూర్ మండల కేంద్రంలోని సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పిచ్చి గడ్డికి మంటలు అంటుకొని కొనుగోలు కేంద్రంలో ఉన్న గన్నీ సంచులు కాలిపోయాయి. అప్రమత్తమైన కూలీలు, రైతులు వెంటనే మంటలు ఆర్పేందుకు నీళ్లు చల్లారు.