లక్ష్యం ఎంచుకొని ఉన్నత శిఖరాలను
అధిరోహించాలి: సీఐ నిరంజన్ రెడ్డి
NEWS Nov 12,2024 01:36 pm
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీఐ నిరంజన్ రెడ్డి అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనను కళాశాల యజమాన్యం ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు ఆయన మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులున్నారు.