పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి
NEWS Nov 12,2024 01:34 pm
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. పిల్లలను తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు సూచించారు. పిల్లల హాజరు శాతం, పరీక్షల ఫలితాలను పరిశీలించాలన్నారు. పిల్లల కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్, సైన్స్ తదితర పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తల్లిదండ్రులు సీనియర్ అధ్యాపకులు CH. శ్రీనివాస్, B.శ్రీనివాస్, జగపతి, నర్సయ్య, రాజేశ్వరరావు, ప్రతిభ, మంజుల, సుదర్శన్, స్వర్ణలత, జాకీర్, అమీనా, ఫాతిమ తదితరులు పాల్గొన్నారు.