ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు: SP
NEWS Nov 12,2024 01:39 pm
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని కడప, అన్నమయ్య జిల్లాల ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. మంగళవారం ఎస్పీ మాట్లాడుతూ.. వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగానూ, పార్టీల మధ్య చిచ్చులు పెట్టిలాంటి పోస్టులకు దూరంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఫేక్ పోస్టులు పెట్టినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.