కాలువపల్లెలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
NEWS Nov 12,2024 06:22 pm
గోపవరం: గోపవరం మండలంలోని కాలువ పల్లె గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోపవరం మండల వ్యవసాయధికారి మాధురి ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులకు ట్రైకోడర్మా విరిడి పశువుల ఎరువుతో కలిసి వాడే ప్రక్రియను డెమో ద్వారా చూపించారు. అలాగే కూనవరం వరి రకాన్ని పరిశీలించిన మీదట ఉత్తమ యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.