రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపీకి ఆహ్వానం
NEWS Nov 12,2024 11:15 am
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 16 నుండి 18 వరకు చేగుంటలోని మోడల్ స్కూల్ లో జరిగే అండర్ 14 బాల బాలికల రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు సిద్దిపేటలోని కలెక్టర్ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి ఆహ్వాన పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అయిత పరంజ్యోతి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.అల్లి నరేష్ , తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, నాగరాజు పాల్గొన్నారు.