ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Nov 12,2024 11:11 am
ధర్మారం మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రోజు ప్రభుత్వ అభివృద్ధి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. రైతులకు కొనుగోలు కేంద్రానికి సంబంధించి స్థలం లేదని తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించడం జరిగిందని ప్రభుత్వం నియమ నిబంధన అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు జరపాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు