MLA పాదయాత్రలో దొంగల చేతివాటం
NEWS Nov 12,2024 10:27 am
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్రలో ఓ వ్యక్తి చేతివాటం చూపించాడు. ర్యాలీలో పాల్గొన్న రైతులు నాయకులను లక్ష్యంగా చేసుకొని పలువురి జేబులను లూటీ చేశాడు. ర్యాలీ మధ్యలో మేడిపల్లి మండలంలోని పిఎన్ఆర్ గార్డెన్లో లంచ్ ఏర్పాటు చేయగా అదే సమయంలో దొంగ జేబులు కత్తిరించడం మొదలు పెట్టాడు. ఇది గమనించిన నాయకులు, రైతులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించగా మేడిపల్లి స్టేషన్ కు తరలించారు.