ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
NEWS Nov 12,2024 10:05 am
మల్లాపూర్ మండలంలోని సాతారం, చిట్టాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటైనా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ లత, మెట్పల్లి ఆర్డీఓతో కలిసి పరిశీలించారు. ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది? ధాన్యానికి సంబంధించి తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని అధికారులకు ఆదేశించారు.