కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ అధికారుల నిరసన
NEWS Nov 12,2024 08:16 am
పెద్దపల్లి: వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ అధికారులపై రైతుల దాడిని నిరసిస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ.. ఫార్మసీ భూసేకరణకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.