రైతుల కోసం ప్రాణ త్యాగంకు సిద్ధం
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్
NEWS Nov 12,2024 06:29 am
రైతుల కోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రైతుల కడుపులు కాలుతున్నాయని మండిపడ్డారు. వారు తినడం లేదని, రోడ్డున పడ్డారని అన్నారు. పదేళ్ల తర్వాత రైతుల ఆత్మహత్యలు మళ్లీ వినబడుతున్నాయని చెప్పారు.