జ్యోతక్క మృతిపై పవన్ సంతాపం
NEWS Nov 12,2024 06:16 am
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి మృతి పట్ల AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సంతాపం ప్రకటించారు. జ్యోతి తెలివైన నాయకురాలని, ఆమె మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఉమెన్స్ లెజిస్లేటర్స్ గ్రూప్ హెడ్ గా ఆమె మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.