సామాజిక బహిష్కరణపై ఫిర్యాదు
NEWS Nov 11,2024 06:20 pm
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో తమను సామాజిక బహిష్కరణ చేశారని గ్రామ యాదవ సంఘం సభ్యులు జిల్లా అడిషనల్ కలెక్టర్ లతకు సోమవారం ఫిర్యాదు చేశారు. తమ గొర్రెలను గ్రామంలో మేపితే రూ. 5 వేలు జరిమానా విధిస్తామని వీడీసీ సభ్యులు మైకుల ద్వారా ప్రచారం చేశారని వారు ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో యాదవ సంఘం జిల్లా నాయకుడు మల్లేష్, నాయకులు ఉన్నారు.