అబుల్ కలాం జయంతి వేడుకలు
NEWS Nov 11,2024 03:50 pm
మైనారిటీ గురుకుల పాఠశాలలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అవార్డులు, సాంస్కృతిక కళారంగాల్లో సేవలందించిన వారికి విశిష్ట అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.