AAAలో జితేందర్ రెడ్డి సినిమా చూసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఈ సినిమాను నక్సలైట్లు (మావోయిస్టులు) చూడాలని పిలుపునిచ్చారు. జితేందర్ రెడ్డి తనతో పాటు BJYMలో పనిచేశారని గుర్తుచేశారు. అమాయకుల ప్రాణాలు తీసే హక్కు వారికెక్కడిదని ప్రశ్నించారు. గిరిజనులను కూడా ఇంకా హత్య చేస్తున్నారని, ఈ పరిస్థితి మార్పుకోసం మావోయిస్టులు హింసను వదిలేసి ప్రజాస్వామ్యంలోకి రావాలని సూచించారు.