ప్రజలను మోసం చేసినందుకా..?
NEWS Nov 11,2024 03:49 pm
కోరుట్ల నియోజకవర్గంలో రైతు ఆధారిత పరిశ్రమ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మీ తండ్రి, మాజీ ఎమ్మెల్యే మూసి వేయించడానికి కారణమైనందుకా? కోరుట్ల నియోజకవర్గంలో పాటు మరో నాలుగు నియోజకవర్గ చెరుకు రైతుల జీవితాలతో చెలగాటం ఆడినందుకా? మూసివేసిన ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తా లేకపోతే ఫ్యాక్టరీ గేటుకు ఉరివేసుకుంటానని రైతులను నమ్మించి ఎన్నికల్లో గెలిచినందుకా? అని కాంగ్రెసు సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రావు విమర్శించారు. పనిలేనివాళ్లే పాదయాత్ర లు చేస్తారని గతంలో కేటీఆర్ అన్నారని, మరీ ఇప్పుడు సంజయ్ ఎందుకు చేస్తున్నారన్నారు.