విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా ధర్నా
NEWS Nov 11,2024 06:28 pm
కడప: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కడప కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చార్జీలను తగ్గించని యెడల పోరాటం ఉదృతం చేస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయ జ్యోతి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..