జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
NEWS Nov 11,2024 03:01 pm
కడప: వేంపల్లి రిపోర్టర్ చిన్న దస్తగిరి రెడ్డిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని తెలుగు జర్నలిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో జిల్లా ఆడిషనల్ (అడ్మిన్) ఎస్పీ ప్రకాష్ బాబుకు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు మాట్లాడుతూ..సమగ్ర విచారణ చేసి జర్నలిస్టులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా కన్వీనర్ ఉప్పు శ్రీకాంత్, కో కన్వీనర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.