కుటుంబ సర్వేను పరిశీలించిన కలెక్టర్
NEWS Nov 11,2024 12:49 pm
జగిత్యాల జిల్లాలో మూడవ రోజు కొనసాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటా సర్వే కార్యక్రమం. సోమవారం సర్వేని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 9 శాతం వరకు సర్వే పూర్తయిందని చెప్పారు. సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. సర్వేకు ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.