మనాలకు బస్సు.. ప్రజల హర్షం
NEWS Nov 11,2024 12:47 pm
వీర్నపల్లి మండలం పలు గ్రామాల ప్రజలు కోరుట్ల నుంచి మనాల మీదుగా వీర్నపల్లికి కోరుట్ల డిపో బస్సు సోమవారం రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రుద్రంగి, మనాల, మర్రి మడ్ల, వీర్నపల్లికి కోరుట్ల డిపో బస్సు రావడానికి కృషి చేసిన మాజీ ఎంపిటిసి బానోతు పద్మ సేవ్య నాయక్ కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.