మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో వెలిసిన అతి పురాతమైన మహాదేవుని ఆలయంలో దాతల సహకారంతో బుధవారం ద్వజ స్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు గ్రామస్తులంతా కలిసి గోదావరి నుండి నీళ్లు తెచ్చి మహాదేవునికి అభిషేకం చేసారు. గ్రామంలో స్వామి వారి ఊరేగింపు శోభయాత్ర నిర్వహించారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.