ఓటుహక్కు నమోదు చేసుకోవాలి: తహశీల్దార్
NEWS Nov 11,2024 03:04 am
ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లో ఆదివారం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని తహసిల్దార్ ప్రసాద్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ..18 సంవత్సరాలు నిండిన వారు నూతన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అలాగే ఓటరు జాబితాలో సవరణల కోసం ఈ నెల 28 వరకు అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు.