కామారెడ్డి జుక్కల్ నియోజకవర్గం లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పోలీసు వాహనంలో తరలించి ఎస్సై విజయ్ మానవత్వం చాటుకున్నారు. మద్నూర్-మేనూర్ మార్గంలో ఆదివారం ఆటో బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులు ముగ్గురికి గాయాలయ్యాయి. అదే సమయంలో వచ్చిన ఎస్సై.. క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించి మద్నూర్ ఆసుపత్రికి తరలించారు.