కొమిరెడ్డి కుటుంబీకులను పరామర్శించిన వివేక్
NEWS Nov 10,2024 01:03 pm
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి అంత్య క్రియలలో ఆదివారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. కొమిరెడ్డి జ్యోతి దేవి కుమారులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.