ధరూర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారును RTC బస్సు ఢీకొనడంతో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. కారులో నలుగురు ఉండగా డ్రైవర్ సంకీర్త్, ఓ మహిళ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వీరిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. జనగామకు పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు జగిత్యాల వాసులుగా తెలుస్తోంది.