మృతదేహంతో హాస్పిటల్ ఎదుట బంధువుల నిరసన
NEWS Nov 10,2024 04:49 am
మెట్ పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యంతో యువకుడు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తూ హాస్పిటల్ వద్ద రాత్రి నుండి మృతదేహంతో బైటాయించారు. కమ్మరిపేట గ్రామానికి చెందిన జువ్వజీ జలంధర్(36) శనివారం జ్వరంతో మెట్ పల్లిలోని శ్రీ గణేష హాస్పిటల్ కు తీసుకొని వచ్చారు. సాయంత్రం యువకుని పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ కి తీసుకువెళ్ళలని చెప్పడంతో అనుమానం వ్యక్తం చేసిన బంధువులు మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని డాక్టర్ చెప్పారు.