చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి నాగేశ్వరరావు
NEWS Nov 10,2024 04:55 am
సమాజంలో జీవించే ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని దానివల్ల ప్రతి మనిషి జీవితానికి మేలు జరుగుతుందని మెట్ పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఛైర్మన్ నాగేశ్వరరావు అన్నారు. మెట్పల్లిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రిన్సిపల్ తిరుపతి, న్యాయవాదులు లింబాద్రి తదితరులు ఉన్నారు.