సిపిఎం మహాసభల కరపత్రం ఆవిష్కరణ
NEWS Nov 09,2024 03:18 pm
బోయిన్పల్లి మండలం నీలోజ్ పల్లి గ్రామంలో సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో 19, 20, తేదీలలో జిల్లా కేంద్రంలో జరుగబోయే మహాసభను విజయవంతం చేయాలని కరపత్రం విడుదల చేశారు. కార్మికుల సమస్యలపై అసంఘటిత రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్న కార్మిక వర్గం పార్టీ సిపిఎం పార్టీ జిల్లా మహాసభలను పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్, గ్రామ శాఖ, కార్యదర్శులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.