కేటీఆర్పై కేసులు పెట్టేందుకు కుట్ర
NEWS Nov 09,2024 10:43 am
"రేవంత్ రెడ్డీ... నీ అన్యాయాలను, మోసాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న కేటీఆర్పై అక్రమ కేసుతో కుట్ర చేయడమంటే అది తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయడమే" అంటూ హరీశ్ రావు నిప్పులు చెరిగారు. మూసీ కాలుష్యం పాపం కాంగ్రెస్దే అన్నారు. మూసీ నది వద్ద సీఎం చేసింది పాదయాత్ర కాదని.. పాపయాత్ర అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సమస్యలు గాలికి వదిలి పక్క రాష్ట్రాల్లో ప్రచారానికి వెళుతున్నారని విమర్శించారు.