గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
NEWS Nov 09,2024 10:50 am
MNCL: జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడ సాయి కుంటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్లుతో మాట్లాడి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొన్నామని, అధికారులకు పలు సూచనలను చేశామని ఎమ్మెల్యే తెలిపారు.