ఏపీని నం.1 చేస్తా: చంద్రబాబు
NEWS Nov 09,2024 07:52 am
విజయవాడ - శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ సర్వీసులను ఏపీలో ప్రారంభించబోతున్నారు. చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఇంతకాలం ఏపీ అంటే అవహేళన చేశారని, కానీ తమ ప్రభుత్వం మళ్లీ ఏపీని నెంబర్ వన్ బ్రాండ్గా చేస్తుందని అన్నారు. అభివృద్ధి జరిగి సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, అలా ఆదాయం పెరిగితేనే పేదల కోసం సంక్షేమం చేయగలమని, అప్పులతో సంక్షేమ పథకాలు ఇస్తే శాశ్వతంగా చేయలేమన్నారు.