జ్యోతి మృతి - పీసీసీ అధ్యక్షుడి సంతాపం
NEWS Nov 09,2024 06:44 am
మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మరణ వార్త తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. మలేషియా పర్యటనకు వెళుతున్న ఆయన ఎయిర్పోర్టులో జ్యోతి దేవి కుమారుడు కొమిరెడ్డి కరంకు ఫోన్ చేసి పరామర్శించారు. మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.