సర్వేపై అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు
NEWS Nov 08,2024 06:44 pm
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక సమగ్ర కుటుంబ సర్వేకు ఆటంకాలు కల్పించినా, ప్రజల్లో అపోహలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం చేయించిన కుటుంబ సర్వే వివరాలు ఉండగా ప్రత్యేకంగా మళ్లీ ఎన్యూమరేషన్ అవసరమా అంటూ బీఆరెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, ఆ వివరాల మదింపు అప్పటి పాలకులు కోరుకున్న విధంగా జరిగిందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.