బీసీలకు పార్టీలు అవకాశం ఇవ్వాలి
NEWS Nov 08,2024 06:42 pm
కోరుట్ల: త్వరలో జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు బీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి షికారి గోపికృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తుమ్మనపెల్లి రాజేంద్రప్రసాద్ కోరారు. కోరుట్లలో వారు మాట్లాడుతూ.. బీసీ జనాభా ప్రకారం సీట్లలో వాటా ఇవ్వాలని, అన్ని పార్టీలు బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని కోరారు.