ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్
NEWS Nov 08,2024 03:37 pm
జగిత్యాలలోని ఎస్కెఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సాయిమధుకర్ కు డాక్టరేట్ లభించింది. రసాయన శాస్త్రం విభాగంలో డాక్టర్ రమేష్ పర్యవేక్షణలో సింథసిస్, బయోలాజికల్ యాక్టివిటీ, అండ్ డాకింగ్ స్టడీ ఆఫ్ ఆక్సాడయోజోలిల్ థయోఫిన్, అండ్ అరైల్, థయడైజోలీల్ ఆరైల్ డెరివేటివ్స్ పరిశోధనకు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయనను ప్రిన్సిపల్ అశోక్ సిబ్బంది అభినందించారు.