కలెక్టర్ ను కలిసిన పుత్తా నరసింహరెడ్డి
NEWS Nov 08,2024 06:45 pm
కడప జిల్లా నూతన కలెక్టర్ గా చెరుకూరి శ్రీధర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం కడప కలెక్టరేట్ లోని కలెక్టర్ కార్యాలయం నందు కమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పుత్తా నరసింహ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ ను శాలువాతో సన్మానించారు. అలాగే కమలాపురం నియోజకవర్గం లోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.