కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
NEWS Nov 08,2024 03:46 pm
కథలాపూర్: వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ సత్య ప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేయాలని, కొనుగోలు వద్ద మంచినీళ్లు అందించాలని, కొనుగోలు విషయంలో జాప్యం లేకుండా చూసుకునే బాధ్యత అధికారులపైన ఉందన్నారు. కథలాపూర్ మండలంలోని సిరికొండ, దూలూరు, కథలాపూర్ బొమ్మన గ్రామాలలో ప్యాక్స్, ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వినోద్, ఎంపీడీవో శంకర్, డి ఆర్డిఓ, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.