ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల ప్రకారం
శుభ్రపరచాలి: నాగమణి
NEWS Nov 07,2024 04:24 pm
కొనుగోలు కేంద్రాలకు తరలించే సమయంలో రైతులు ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల ప్రకారం శుభ్రపర్చాలని మండల వ్యవసాయ అధికారి నాగమణి సూచించారు. కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం తేమ శాతం 17 కంటే తక్కువగా ఉండేలా చూడాలన్నారు. పంటను కోసే సమయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.