అండగా ఉంటాను.. ఆదరించండి: శేఖర్
NEWS Nov 07,2024 02:26 pm
తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు పాఠశాలల చీఫ్ అడ్వైజర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు మెట్ పల్లి పట్టణంలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యంతో సమావేశమయ్యారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అందరికి అండగా ఉంటానని ఆదరించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు, రవిప్రసాద్, రామారావు, రాజకుమార్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.