కుటుంబ సర్వేపై MPDO పరిశీలన
NEWS Nov 07,2024 02:24 pm
మెట్ పల్లి మండలంలోని చౌలమద్ది గ్రామంలో జరుగుతున్న ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వేను గురువారం ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే చేస్తున్న ఎన్యుమారేటర్లకు ఎంపీడీవో పలు సూచనలు చేశారు. కుటుంబ నిర్ధారణ వివరాలు తప్పులు లేకుండా సేకరించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి ఎన్యుమారెటర్లు రాములు, కవిత, దీప, లక్ష్మి, సురేష్ తదితరులు ఉన్నారు.