క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ
NEWS Nov 07,2024 04:31 pm
చాపాడు: చాపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఓబులేసు ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు గుర్తించడం, సమర్థ వంతమైన చికిత్సా విధానాలు గురించి ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాఘవయ్య, తదితర సిబ్బంది పాల్గొన్నారు.