ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలో గోధూర్ గ్రామంలో ఫ్యాక్స్ సెంటర్ మరియు మెట్ పల్లి మండలంలోని ఆత్మానగర్ గ్రామంలో ఐకెపి సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని కలెక్టర్ పరిశీలించారు. అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు. సంబంధిత ఏఈఓను కేంద్రం ఏ విధంగా నడుస్తుంది అని తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కోరారు.