జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని అంగన్వాడి కేంద్రం మందు బాబులకు అడ్డాగా మారింది. అంగన్వాడి టీచర్ రామగిరి రమాదేవి మాట్లాడుతూ.. పోకిరీలకు మందుబాబులకు, అంగన్వాడి కేంద్రం గత కొన్ని రోజులుగా అడ్డగా మారిందని, మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ మద్యం సీసాలు పగలగొడుతున్నట్లు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ఆమె కోరారు.