చెరువులు, కుంటలపై కడుతున్న
తహాసిల్ శిస్తును మాఫీ చేయాలి
NEWS Nov 07,2024 08:33 am
చెరువు, కుంటలపై ఏటా మత్స్య సహకార సంఘాలు కడుతున్న తహసీల్ శిస్తును 2024 - 25 సంవత్సరానికి మాఫీ చేయాలని మత్స్య సహకార సంఘాల జిల్లా డైరెక్టర్ తోకల రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడాది 100 శాతం చేప పిల్లలు జూన్, జూలై నెలల్లో చెరువులలో వదిలేవారని, వేసవి కాలం నాటికి మంచి దిగుబడి వచ్చేదని, ఈ ఏడాది 50 శాతం పిల్లలను మాత్రమే వదలడం, అది కూడా నవంబర్ నెలలో వదలడం వల్ల నష్టపోతున్నమని చెప్పారు.