కార్మికుల ప్రమాదంపై ఎమ్మెల్యే విచారం
NEWS Nov 07,2024 04:20 am
కోరుట్ల పట్టణంలో పాత బస్టాండ్ వద్ద మున్సిపల్ పారిశుద్ధ ట్రాక్టర్ ను ఢీకొని ఆరుగురు మున్సిపల్ సిబ్బందికి గాయాలు అవ్వడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహయం అందించాలని ప్రభుత్వ వైద్యులను సూచించారు. గురువారం ఉదయం కోరుట్ల నంది చౌరస్తా వద్ద బోధన్ డిపో బస్సు మున్సిపల్ ట్రాక్టర్ ని ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది.